Priyamani : ఒక ఫోటోతో పుకార్లకు చెక్ పెట్టిన ప్రియమణి.. ఇంత‌కీ ఆ ఫోటోలో ఏముంది?

-

Priyamani : అందాల తార ప్రియమణి.. పరిచయం అవసరం లేని పేరు. సౌత్ ఇండియాలోని అన్నిభాషల్లో న‌టించింది. త‌న అందం, అభిన‌యంతో దక్షిణాది ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది. ఇండస్ట్రీలో దాదాపు అంద‌రూ స్టార్ హీరోల స‌ర‌స‌న న‌టించింది. హీరోయిన్ గా అవకాశాలు తగ్గుతున్న సమయంలో వివాహం చేసుకుంది. అనంత‌రం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి.. బుల్లి తెర మీద అడుగు పెట్టింది. ఇలా ఎప్పటికప్పుడు ప్లానింగ్ చేసుకుంటూ ప్రియమణి ముందుకు సాగుతోంది. ప్రస్తుతం ప్రియమణి వైవాహిక జీవితానికి సంబంధించి రకరకాల వార్తలు వ‌స్తున్నాయి.

గ‌త కొంత కాలంగా.. న‌టి ప్రియమణి, త‌న భర్త ముస్తాఫా రాజ్‌ నుంచి విడిపోతున్నట్లు వార్తలు వైర‌ల్ అవుతున్న విష‌యం తెలిసిందే. గతంలో ముస్తఫా తనకు మాజీ భర్త కాదని.. ఇప్పటికీ తాము విడాకులు తీసుకోలేదని, ముస్తాఫా మొదటి భార్య అయేషా ఆరోపించిన సంగతి తెలిసిందే. ప్రియమణి వివాహం చెల్లదని కీలక వ్యాఖ్యలు చేసిన విష‌యం తెలిసిందే. ఈ మ‌ధ్య కాలంలో వీరిద్దరూ త్వరలోనే విడాకులు తీసుకోనున్నారంటూ పుకార్లు షికార్లు చేశాయి.

ఈ క్ర‌మంలో పుకార్ల‌కు చెక్ పెట్టింది ప్రియమణి. అన్ని రూమర్స్‌కు చెక్‌ పెట్టేలా.. దీపావళి సందర్భంగా భర్త ముస్తాఫా రాజ్‌తో కలిసి దిగిన ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. భర్తతో చిరునవ్వులు చిందిస్తూ ఫోటోను పంచుకుంది. దీంతో వీరిద్దరూ మధ్య తేడా కొట్టిందని జరుగుతోన్న వార్తలకు ఫుల్‌ స్టాప్‌ పడినట్లు అయ్యింది. విడాకుల రూమర్స్‌కు నోరు విప్పకుండానే చెక్‌ పెట్టింది ప్రియమణి.

Read more RELATED
Recommended to you

Latest news