ఇండియాలో కొత్తగా 10,853 కరోనా కేసులు, 260 రోజుల తర్వాత ఇదే మొదటిసారి !

-

ఇండియాలో కరోనా మహమ్మారి కేసులు.. తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తోంది. కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం… గడిచిన 24 గంటల్లో దేశంలో 10,853 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 1,44,845 కు చేరింది. గడిచిన 260 రోజుల్లో ఇంత తక్కువ యాక్టివ్‌ కేసులు నమోదవడం ఇదే మొదటి సారి. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 98. 24 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 526 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 4, 60, 791 కి చేరింది.

గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తం గా 12,432 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 3,37,49, 900 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,08,21,66,365 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 28,40, 174 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ.

Read more RELATED
Recommended to you

Latest news