బ్రేకింగ్‌ : మణిపాల్‌ ఆస్పత్రిలో చేరిన సీఎం జగన్‌ ?

-

సెప్టెంబర్‌ మాసంలో ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి గాయం అయిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్‌ 24 న తేదీ సాయంత్రం సమయంలో ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి వ్యాయామం చేస్తున్న సమయంలో…. ఆయన కాలు బెనికింది. అయితే.. ఈ సంఘటన లో సీఎం జగన్‌ కాలుకు ఎలాంటి పెద్ద గాయాలు కాలేదు.

అయితే.. సీఎం జగన్‌ కు కాలికి పెద్ద గాయం కాకపోవడంతో… డాక్టర్లు సాధారణ ట్రీట్‌ మెంట్‌ ఇచ్చారు. అయితే.. ఆ గాయం కారణంగా.. ఢిల్లీ టూర్‌ ను కూడా రద్దు చేసుకున్నారు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి. ఇది ఇలా ఉండగా… తాజాగా ఇదే గాయం కారణంగా విజయవాడ లోని మణిపాల్‌ ఆస్పత్రికి వెళ్లారు సీఎం జగన్. జనరల్ చెకప్స్ లో భాగంగానే…హాస్పిటల్ కు వెళ్లిన సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి… దాదాపు 45 నిమిషాల నుంచి హాస్పిటల్ లోనే ఉన్నారు. అనంతరం… తిరిగి క్యాంప్‌ ఆఫీస్‌ కు చేరుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news