జమ్మూ కాశ్మీర్ లో ఎన్ కౌంటర్… ఇద్దరు హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాదుల హతం

-

జమ్మూ కాశ్మీర్ లో భద్రతా బలగాలకు మరో విజయం లభించింది. ఎన్ కౌంటర్ లో ఇద్దర హిజ్బుల్ ముజాహీద్దీన్ ఉగ్రవాదులను హతమార్చారు. కుల్గాం జిల్లా చవాల్గామ్ ఏరియాలో నిన్న సాయంత్రం నుంచి ఎన్ కౌంటర్ కొనసాగుతోంది. పెద్ద ఎత్తున కూంబింగ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. ఎన్ కౌంటర్ లో మరణించిన ఉగ్రవాదిని హిజ్బల్ ముజాహిద్దీన్ జిల్లా కమాండర్ సిరజ్ మౌల్వీగా, మరో ఉగ్రవాదిని యావర్ భట్ గా గుర్తించారు. ఇది భద్రతా దళాలకు భారీ విజయంగా జమ్మూ కాశ్మీర్ ఐజీ విజయ్ కమార్ తెలిపారు. సదురు ఉగ్రవారి 2006 నుంచి ఉగ్రవాద కార్యకలాపాల్లో క్రియాశీలకంగా ఉన్నట్లు తెలిపారు. జమ్మూ కాశ్మీర్ లోని యువతను ఉగ్రవాద కార్యకలాపాల వైపు ఆకర్షించడంలో సిరజ్ ప్రధాన పాత్ర పోషించుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. మరోవైపు చవాల్గామ్ ప్రాంతంలో ఎన్ కౌంటర్ కొనసాగుతూనే ఉంది. సంఘటన స్థలం నుంచి ఆయుధాలను బద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఇదిలా ఉంటే గత మంగళవారం కాశ్మీర్ లో వీది వ్యాపారిని హత్య చేసిన సంఘటనలో మరణించిన ఉగ్రవాదులు ఉన్నట్లుగా తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Latest news