బ్రేకింగ్‌ : పెద్దపల్లిలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ : 24 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు

-

ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలు విపరీతంగా జరుగుతున్నాయి. పొద్దున లేచి.. పేపర్‌, టీవీ చూడగానే యాక్సిడెంట్‌ కు సంబంధించిన వార్తలే వస్తున్నాయి.  ప్రభుత్వాలు ఎన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నప్పటీకీ…  రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి.  అయితే.. తాజాగా పెద్దపల్లి జిల్లాలోని మంథని పట్టణం లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.

మంథని ప్లై ఓవర్ పై ఆర్టీసీ బస్సును డీసిఎం లారీ ఢీ కొట్టింది. అయితే.. ఈ ఘోర ప్రమాదంలో…. బస్సు లోని 24 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం అందుతోంది. మంచిర్యాల నుండి కరీంనగర్ కు వెలుతున్న TS19Z 0020 ఆర్టీసీ బస్సు మంథని మూల వద్ద డీసిఎం వ్యాన్ ఢీ కొనడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే.. ఆర్టీసీ డ్రైవర్ అప్రమత్తంతో భారీ ప్రమాదమే తప్పింది. ప్రస్తుతం ఆ ప్రయాణికులను…. స్థానిక ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్‌ ఓవర్‌ స్పీడ్‌ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news