కేరళకు సన్ని ఏమిచ్చింది అంటే..!

-

కేరళలో వరదల కారణంగా అక్కడ ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. వందల కొద్ది ప్రాణాలు కూడా కోల్పోయారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహాయక చర్యలు చేస్తున్నా సరే కేరళకు వరద బీభత్సం వల్ల భారీ నష్టం కలిగిందని తెలుస్తుంది. ఇక సెలబ్రిటీస్ తమ వంతు సాయంగా కేరళకు విరాళాలు అందిస్తున్నారు. సౌత్ లో స్టార్స్ అందరు తమ వంతుగా విరాళాలు ప్రకటించగా ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్ సన్ని లియోన్ తన వంతుగా బాధితులకు బియ్యం, పప్పులను సాయం అందించింది.

1200 కిలోల బియ్యం, పప్పులను సన్ని ఆమె టీం కేరళ బాధితులకు సహాయంగా అందిస్తుంది. పోర్న్ స్టార్ నుండి బాలీవుడ్ రొమాంటిక్ హీరోయిన్ గా మారిన సన్ని సమయం దొరికినప్పుడల్లా తన గొప్ప మనసుని చాటుకుంటుంది. కేరళ బాధితులకు సాయంగా సన్ని ఇచ్చిన ఆ బియ్యం, పప్పులు చాలు ఆమె ఎలాంటి మనసున్న మనిషని చెప్పడానికి. ఇక కేరళలో పరిస్థితి విషయానికొస్తే వర్షాలు తగ్గుముఖం పట్టగా వరద నీరు ప్రభావం కాస్త బెటర్ అని అంటున్నారు. అయితే జరిగిన నష్టం ఎంత అన్నది తెలియలేదు. కాని ఊహించని పెద్ద మొత్తంలో వరద నష్టం జరిగిందని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news