ఈటల భూ కబ్జా కేసులో ట్విస్ట్… రెండో రోజు సర్వేలో కీలక పరిణామాలు !

-

మాజీ మంత్రి, హుజురాబాద్‌ నియోజక వర్గ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ భూ కబ్జా కేసులో రోజు కో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట గ్రామం లో హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్న భూ కబ్జా ఆరోపణ పై తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వుల మేరకు రెండవ రోజు భూ సర్వే కొనసాగుతోంది.

etala
etala

ఈ రోజు 68 ఎకరాల్లో సర్వే చేయనున్నారు అధికారులు. డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే తూప్రాన్ డివిజన్ అధికారి సర్వే నోటీసు జారీ చేసారు. ఈరోజు అచ్చంపేట గ్రామం లో గల సర్వే నంబర్ 77,78,79,80,81,82, లలో సర్వే చేయనున్నారు. ఈ సర్వే నంబర్లలో జమున హెచరీస్ కి సంబంధించిన ఈటెల జమున, ఈటెల నితిన్ తో పాటు అచ్చంపేట గ్రామానికి చెందిన నలుగురు రైతులకు డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే ముందస్తు నోటీసులు జారీ చేశారు. అయితే… అధికారులు సర్వే ప్రారంభించిన నేపథ్యంలోనే.. ఈటలకు వ్యతిరేకంగా… నినాదాలు చేశారు. తమ భూములు అన్యాయంగా దోచుకున్నారని నిరసన తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news