ముంబైలో ఘోరం….20 ఏళ్ల యువతిపై అత్యాచారం, హత్య

-

దేశంలో నానాటికి అత్యాచారాల సంఖ్య పెరుగుతోంది. ప్రభుత్వాలు ఎన్నిచట్టాలు తీసుకువచ్చినా.. కామాంధుల్లో మార్పు రావడం లేదు. తాజాగా ముంబై నగరంలో ఘోరం జరిగింది. 20 ఏళ్ల యువతిని అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేశారు దుండగులు. ఈ ఘటన ప్రస్తుతం ముంబైలో కలకలం రేపింది. కుర్లాలోని హెచ్‌డీఐఎల్ కాల‌నీలో ఖాళీగా ఉన్న పాత భ‌వ‌నం టెర్ర‌స్‌పై లిఫ్ట్ రూంలో కుళ్లిపోయిన స్ధితిలో యువ‌తి మృత‌దేహం ల‌భ్య‌మైంది. యువతి చనిపోయే ముందు అత్యాచారం చేసినట్లుగా అధికారులు నిర్థారించారు.

ఈ ఘటన జరిగి రోజుల గడవడంతో శరీరం కుళ్లిపోయే పరిస్థితికి వచ్చింది. శరీరాన్ని వినోబా భావే పోలీస్ అధికారులు పోస్ట్‌మార్టం కోసం పంపించారు. యువ‌తి త‌ల‌పైనా బ‌ల‌మైన గాయాలున్నాయ‌ని, ఆమెను లైంగిక వేధింపుల‌కు గురిచేశార‌ని పోస్టుమార్టం నివేదిక‌లో వెల్ల‌డైందని పోలీసులు తెలిపారు. కొంద‌రు యువ‌కులు గురువారం సాయంత్రం వీడియో షూట్ కోసం ఖాళీ భ‌వ‌నంలోకి వెళ్లార‌ని అక్క‌డ వారికి యువ‌తి మృత‌దేహం క‌నిపించ‌గా పోలీసుల‌కు స‌మాచారం అందించార‌ని డీసీపీ ప్ర‌ణ‌య్ అశోక్ చెప్పారు. ఆయన మాట్లాడుతూ, బాధితురాలు యొక్క గుర్తింపును నిర్ధారించడానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని, సీసీ కెమెరా పుటేజీని పరిశీలిస్తున్నామని తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Latest news