ఇండియాలో 8774 కరోనా కేసులు.. 543 రోజుల తర్వాత ఇదే మొదటిసారి

-

ఇండియాలో కరోనా మహమ్మారి కేసులు రోజు రోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల హెల్త్ బులిటెన్ ప్రకారం… దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో దేశంలో 8,774 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 1,05,691 కు చేరింది. ఇంత తక్కువ యాక్టివ్ కేసులు సంఖ్య నమోదు కావడం 543 రోజుల తర్వాత ఇదే మొదటి రోజు.

ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 98.34 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 396 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 4,68, 554 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 9,481 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 3,39,98, 278 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,21,94,71,134 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 82,86, 058 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ.

Read more RELATED
Recommended to you

Latest news