తల నరికి మొండెం పక్కనే నిద్రపోయిన నిందితుడు

-

సహోద్యోగిపై కక్ష పెంచుకున్నహత్య చేశాడు. అనంతరం తలను మొండెం నుంచి వేరు చేసి రాత్రంతా అక్కడే నిద్రపోయడు. తెల్లవారిని తర్వాత సహోద్యోగి తలను ప్లాస్టిక్ కవర్‌లో చుట్టి చెత్తకుండీలో పడేశాడు. ఒళ్లు గగుర్పొడిచే సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని గజియాబాద్‌లో చోటుచేసుకుంది.

ఆటో మొబైల్ కంపెనీలో ప్రమోద్ కుమార్, సందీప్ మిశ్ర ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. ఉన్నతాధికారులకు తనపై ఫిర్యాదు చేశాడని ప్రమోద్‌కుమార్‌పై సందీప్ కక్ష పెంచుకున్నాడు. గత ఆదివారం రాత్రి పార్టీ ఉందని పిలిచాడు. ప్రమోద్‌కుమార్ మద్యం మత్తులో ఉన్నప్పుడు అతడి తలను కత్తితో తెగ నరికాడు. ఆ రాత్రికి మొండెం పక్కనే నిద్రపోయాడు. ఉదయం పక్కనే ఉన్న చెత్త కుండీలో ప్రమోద్ తలను కవర్‌లో చుట్టి విసిరేశాడు. ఎంత ఫోన్ చేసినా భర్త స్పందించకపోవడంతో హతుడి భార్య నిందితుడు సందీప్ ఇంటికి రావడంతో అసలు విషయం బయటపడింది.

Read more RELATED
Recommended to you

Latest news