కేసీఆర్ సంచ‌ల‌న నిర్ణ‌యం..ఆ జిల్లాల్లో వ‌రుస‌గా బ‌హిరంగ స‌భ‌లు

-

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే తెలంగాణ జిల్లాల్లో పర్యటించేందుకు సన్నద్ధం అయ్యారు సీఎం కేసీఆర్. వివిధ ప్రారంభోత్సవాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం పాల్గొననున్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్.. పూర్తి మంగళవారం రోజు లెక్కింపు చేపట్టనున్నారు. దీంతో సీఎం కేసీఆర్ జిల్లా పర్యటన సిద్ధమవుతున్నట్లు సమాచారం.

KCR-TRS
KCR-TRS

ఈ మేరకు ఆయా జిల్లాలో ఉన్న మంత్రులు, శాసనసభ్యులు లో సీఎం కేసీఆర్ తో చర్చలు చేశారు. ముఖ్యంగా వనపర్తి, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, వికారాబాద్, జనగాం, మహబూబాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా బహిరంగ సభలు కూడా నిర్వహించేందుకు అధికార టీఆర్ఎస్ పార్టీ సన్నద్ధం అవుతోంది. ఈ జిల్లాల ప‌ర్య‌ట‌న పై మ‌రో రెండు రోజుల్లోనే అధికారిక ప్ర‌క‌ట‌న రానుంది. ఈ జిల్లాల ప‌ర్య‌ట‌న‌ల ద్వారా.. ప్ర‌తి ప‌క్షాల‌కు కౌంట‌ర్ ప‌డ‌టమే కాకుండా.. పార్టీ కూడా బ‌లంగా త‌యార‌వుతుంద‌ని.. కేసీఆర్ భావిస్తున్నార‌ట‌.

Read more RELATED
Recommended to you

Latest news