రూ.40 కే సన్న బియ్యం ఇస్తాం..సోము వీర్రాజు ప్రకటన…!

-

ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు రీసెంట్ గా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాము అధికారంలోకి వస్తేనే చీప్ లిక్కర్ ను రూ.50 కే ఇస్తామంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలతో ఒక్కసారిగా దుమారం రేగింది. సోము వీర్రాజు పై విమర్శలు వచ్చాయి. అయితే తాజాగా ఆయన మరో ప్రకటన చేశారు. బిజెపి అధికారంలోకి వస్తే రూ.50 కి కిలో సన్నబియ్యం ఇస్తామని ప్రకటించారు.

ప్రస్తుతం సన్నబియ్యం కిలో రూ.50 నుండి 60 వరకు ఉందని దాంతో ప్రజలపై భారం పడుతోందని ఆయన ఆరోపించారు. అదే విధంగా టమాటా, ఉల్లి ఇతర కూరగాయల ధరలు కూడా అందుబాటులో ఉంచుతూ ప్రజలకి నష్టం జరగకుండా చూస్తామని పేర్కొన్నారు. అంతే కాకుండా తాను లిక్కర్ పై వేరే ఉద్దేశ్యం తో చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి వివాదం రేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news