శుభ‌వార్త : కాళేశ్వ‌రానికి అరుదైన గుర్తింపు!

-

తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నదిపైన సీఎం కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు మరో అరుదైన గుర్తింపు దక్కింది. ఈ సారి కాళేశ్వరం ప్రాజెక్టు కార్పొరేషన్‌ కు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పోరేషన్‌ నుంచి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది.

ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులకు తెలంగాన రాష్ట్ర ప్రభుత్వం వివిధ ఆర్థిక సంస్థల నుంచి నిధులు సమీకరించుకుని లక్ష్యం మేరకు పనులు పూర్తి చేసి.. రైతులకు గోదావరి జలాలను అందుబాటులోకి తీసుకురావడటంలో సఫలీకృతమైంది.

కాళేశ్వరం సమీపాన మేడిగట్ట వద్ద, మేడిగడ్డ శ్రీ పాద ఎల్లంపల్లి ప్రాజెక్టుల మద్య అన్నారం, సుందీళ్ల గ్రామాల వద్ద కాలువలు, సోరంగ మార్గాలు, జలశాయాలు, నీటి పంపినీ వ్యవస్థలు, ఎత్తి పోతల పథకాల ద్వారా తెలంగాణ రాష్ట్రంలో 13 జిల్లాలకు సాగు నీరు, తాగు నీరందించేందుకు సీఎం కేసీఆర్‌.. కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టును 2016 లో కేసీఆర్ సర్కార్‌ ప్రారంభించింది.

Read more RELATED
Recommended to you

Latest news