ప్రభుత్వ పాఠశాలల్లోని 8, 9, 10 తరగతుల విద్యార్థులకు సోమవారం నుంచి ఆన్లైన్ క్లాస్లను నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ డీఈవోలకు ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో 8, 9, 10 తరగతులున్న ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు 470 ఉండగా, అందులో సుమారు 22 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి సోమవారం నుంచి ఆన్లైన్ తరగతులు నిర్వహించనున్నారు. టీచర్లు, సిబ్బంది పాఠశాలలకు నిత్యం 50 శాతం మంది హాజరుకానున్నారు.
సంగారెడ్డి: నేటి నుంచి ఆన్లైన్ క్లాసులు
By Naga Babu
-
Previous article
Next article