వైఎస్‌ షర్మిల పార్టీలోకి కొడాలి నాని !

-

గుడివాడ క్యాసినో వ్యవహారం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలను కుదేపిస్తుంది. ఇందులో భాగంగానే… టీడీపీ నాయకుతలతో పాటు బీజేపీ పార్టీ నేతలు మంత్రి కొడాలి నానిని టార్గెట్‌ చేస్తున్నారు. ఇక తాజాగా… టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బుద్దా వెంకన్న కొడాలి నానిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్‌ షర్మిల ఏపీలో పార్టీ పెడితే, అందులో చేరి జగన్ను బూతులు తిట్టే మొదటివ్యక్తి కొడాలినాని అంటూ పేర్కొన్నారు. చంద్రబాబు గేట్ తాకితే కొడాలి నాని శవాన్ని పంపుతానని హెచ్చరించారు.

ప్రజలకు మేలు చేయటం చేతకాకే.. చంద్రబాబుపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని నిప్పులు చెరిగారు. గుడివాడలో బస్సులు, లారీల్లో కొడాలి నాని ఆయిల్ దొంగతనం చేస్తే, అప్పుడు పోలీసు అధికారిగా ఉన్న వర్ల రామయ్య చర్యలు తీసుకోలేదా..? అని ప్రశ్నించారు.చంద్రబాబు సీఎం అయ్యాకే కొడాలి నానికి టీడీపీలో స్థానంలో దక్కిందని… హరికృష్ణ గుడివాడలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే, మధ్యలో వదిలేసి పారిపోయిన వ్యక్తి కొడాలి నాని అని పేర్కొన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news