సీఎం కేసీఆర్ ని కలిసిన భాజపా ఎమ్మెల్యేలు

-

తెలంగాణలోని భాజపా ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఈ రోజు సాయంత్రం కలిశారు. మాజీ ప్రధాని దివంగత వాజ్ పేయి స్మృతి వనం ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం తరుఫున స్థలం కేటాయించాలని కోరారు. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ వారికి సానుకూలంగా స్పందించారు.  ఢిల్లీ పర్యటన తర్వాత ఇప్పటి వరకు ఎవ్వరికి అపాయింట్ మెంట్ ఇవ్వని కేసీఆర్ నేడు భాజపా ఎమ్మెల్యేలకి ఇవ్వడంపై రాజకీయ పక్షాల్లో తీవ్ర ఆసక్తి కరమైన చర్చ కొనసాగుతోంది. ముందస్తు ఎన్నికల ప్రచారం రోజురోజుకి ఊపందుకుంటున్న నేపథ్యంలో భాజపా నేతలు సీఎంతో భేటీ ఎంతో ప్రధాన్యతని సంతరించుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news