ఇండియాలో భారీగా తగ్గిన కరోనా.. కొత్తగా 1,27,952 కేసులు నమోదు

-

ఇండియాలో కరోనా థర్డ్‌ వేవ్‌ తీవ్రత భారీగా తగ్గుతూ వస్తోంది. గడిచిన 10 రోజుల కిందట.. 3 లక్షలకు తగ్గకుండా కరోనా కేసులు నమోదు అయ్యాయి. అయితే.. ఇప్పుడు మాత్రం.. కరోనా మహమ్మారి కేసులు… విపరీతంగా తగ్గి పోతున్నాయి. ఇక తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 1,27,952 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,20,80,664 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 96.60 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 1059 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 5,01,114 కి చేరింది.

ఇక ఇండియాలో రోజు వారీ కేసుల శాతం 7.9% శాతంగా నమోదు కాగా… నిన్నటి కంటే.. 14% శాతం కరోనా కేసులు ఎక్కువగా తగ్గి పోయాయి.ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 13,31,648 కు చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 2,30,814 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,68,98,17,199 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ.

Read more RELATED
Recommended to you

Latest news