బీజేపీ ప్రభుత్వ హయాంలో దేశంలో అవినీతి కంపు కొడుతోంది: కేసీఆర్

-

బీజేపీ పరిపాలనలో దేశం నాశనం అవుతోంది. దేశంలో అవినీతి కంపు కొడుతోంది. దేశంలో అన్ని స్థాయిలో ఘోరమైన అవినీతి ఉందని తీవ్ర విమర్శలు చేశారు సీఎం కేసీఆర్. జాతీయ అంతర్జాతీయ మీడియా చెబుతోంది. దేశంలో 77 శాతం సంపద 10 శాతం దగ్గరే ఉంది. మీ ప్రభుత్వంలో ధనవంతులు.. ధనవంతులు అవుతుంటే.. పేదలు.. పేదలు అవుతున్నారు. ఇది మీ ప్రభుత్వం చెప్పిన లెక్కలే అని..ఎన్ఎస్ఓ లెక్కలనే నేను చెబుతున్నానని సీఎం కేసీఆర్ అన్నారు. నిరుద్యోగిత రేటు పెరిగింది. తెలంగాణలో 0.3 శాతం ఉంటే.. దేశంలో 7 శాతం ఉంది. హంగర్ ఇండస్ట్రీలో 101 స్థానంలో ఉందని విమర్శించారు. ఇండస్ట్రీయల్ ప్రోడక్షన్ తగ్గిందని విమర్శించారు. నరేంద్ర మోదీ, ఎన్డీయే ప్రభుత్వ పనితీరుకు ఇది నిదర్శనం అని అన్నారు. దేశం పరువుపోతుందని అన్నారు. ఘోరమైన పరిస్థితి ఉందని.. బ్యాంకులకు దోచే దొంగలను దేశాలు దాటించారని విమర్శించారు. 33 మంది బ్యాంకులను దోచుకుని పారిపోయారని కేసీఆర్ విమర్శించారు. ఇదా మీ దేశ భక్తి అంటూ.. ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news