సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం అల్లమయిపేట జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బసవ వాగుల బ్రిడ్జిపై అతి వేగంగా వచ్చిన ఆటో, బైక్ ను ఢీకొట్టడంతో బైక్ పై వెళ్తున్న శ్రీకాంత్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు అల్లమయిపేట గ్రామస్తుడిగా గుర్తించారు. తన సొంత గ్రామం నుండి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు
Medak: అందోల్ మండలంలో రోడ్డు ప్రమాదం
By Naga Babu
-
Previous article
Next article