“భీమ్లా నాయక్”ఫ్యాన్స్‌ కు గుడ్‌ న్యూస్‌..ఏపీలో బెనిఫిట్ షోలు షురూ !

-

“భీమ్లా నాయక్”ఫ్యాన్స్‌ కు గుడ్‌ న్యూస్‌. ఏపీలో బెనిఫిట్ షోలు షురూ అయ్యాయి. అయితే.. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలోని ప్రాంతాల్లో కాదండోయ్‌. కేవలం యానాంలో మాత్రం “భీమ్లా నాయక్” మూవీ కోసం బెనిఫిట్‌ షోలు వేశారు. ఇవాళ ఉదయం 5 గంటల నుంచి భీమ్లా నాయక్ బెనిఫిట్ షోలు ప్రారంభం అయ్యాయి. యానాం రెండు థియేటర్లలో ప్రత్యేక షోలకు పుదుచ్ఛేరి అధికారుల అనుమతి ఇచ్చారు.

యానాం ప్రాంతం ఏపీ బార్డర్‌ ఉంది. ఈ నేపథ్యంలోనే.. బెనిఫిట్‌ షోలు షురూ అయ్యాయి. దీంతో తూర్పుగోదావరి నుంచి ఫ్యాన్స్ యానాం వెళుతున్నారు. ఫ్యాన్స్‌ ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో.. 500 రూపాయలకు బెనిఫిట్ షో టికెట్స్ అమ్మారు.

యానాంలోని థియేటర్లలలో మాత్రమే బెనిఫిట్స్ షో వేయడంతో భీమ్లా నాయక్ సినిమా చూసేందుకు తరలి వచ్చారు పవన్ అభిమానులు. ఫ్యాన్స్ వాహనాలు కార్ల తో కిక్కిరిసింది యానాం ప్రాంతం. ఇక ఏపీలోని చాలా ప్రాంతాల్లో భీమ్లా నాయక్ సినిమాపై ఏపీ సర్కార్‌ ఆంక్షలు విధిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news