బంగారు వర్ణంలో మెరిసిపోతున్న కీర్తి సురేష్… అందానికి ఫిదా అవుతున్న నెటిజెన్లు

-

జ.కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టాలీవుడ్, కోలీవుడ్ లతో మోస్ట్ డిమాండ్ ఉన్న హీరోయిన్. బడా స్టార్లతో నటిస్తూ.. బిజీగా ఉంది కీర్తి సురేష్.

తాజాగా ఆమె ఇన్ స్టా గ్రామ్ లో తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేసింది. బంగారువర్ణంతో మత్తెక్కించేలా ఉన్నా ఫోటోలు. వీటిని చూస్తూ నెటిజెన్లు ఫిదా అవుతున్నారు.

తన అందంలో కుర్రకారుకు సెగలు పుట్టిస్తోంది ఈ అమ్మడు. హోమ్లీ లుక్ లో అందర్ని ఆకట్టుకుంటున్నాయి కీర్తిసురేష్ ఫోటోలు. దీనికి నెటిజెన్లు  నుంచి కూడా తెగ కామెంట్లు వస్తున్నాయి. ఒక్కరోజు వ్యవధిలోనే లక్షలకు పైగా లైక్స్ తెచ్చకున్నాయి. సూపర్ హాట్, బ్యూటీ, ఐలవ్ యూ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్లు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం కీర్తీ సురేష్.. సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ‘ సర్కార్ వారి పాట’ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే ఇటీవల రిలీజ్ అయిన ‘ గుడ్ లక్ సఖి’ సినిమా నిరాశపర్చింది.

ఓ వైపు గ్లామర్ పాత్రలను పోషిస్తూనే.. మరో వైపు నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను చేస్తోంది కీర్తి సురేష్. 

Read more RELATED
Recommended to you

Latest news