కరీంనగర్ : జమ్మికుంటలో రోడ్డు ప్రమాదం

-

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం బిజిగిరిషరీఫ్ దర్గా సమీపంలో మూలమలుపు వద్ద శుక్రవారం రాత్రి టిప్పర్ బైకును ఢీకొంది. ఘటనలో వీణవంక మండలం పోతిరెడ్డిపల్లెకు చెందిన పల్లె బుచ్చయ్య, పల్లె పోచయ్య, అయిలేని సదానందంకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులకు జమ్మికుంటలోని ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేసి, మెరుగైన వైద్యం నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు

Read more RELATED
Recommended to you

Latest news