ఏపీలో స్వ‌ల్పంగా త‌గ్గిన కరోనా కేసులు.. నేడు 40

-

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో నేడు క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసుల సంఖ్య స్వ‌ల్పంగా త‌గ్గాయి. నిన్న‌టితో పోలిస్తే.. నేడు దాదాపు 35 క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసులు త‌గ్గాయి. ఈ రోజు ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో 50 లోపే క‌రోనా కేసులు వెలుగు చూశాయి. కాగ నేటి క‌రోనా వైర‌స్ బులిటెన్ ను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విడుద‌ల చేశారు. ఈ కరోనా బులిటెన్ ప్ర‌కారం.. ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ‌డిచిన 24 గంట‌ల్లో కేవ‌లం 40 క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి.

కాగ శుక్ర‌వారం రోజు రాష్ట్రంలో 75 క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. అంటే శుక్ర‌వారంతో పోలిస్తే.. నేడు 35 క‌రోనా కేసులు త‌గ్గాయి. కాగ ఈ రోజు కూడా ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా మ‌ర‌ణాలు న‌మోదు కాలేదు. కాగ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 58 మంది క‌రోనా వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ప్ర‌స్తుతం 518 క‌రోనా వైర‌స్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగ నేడు ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు.. 8,081 క‌రోనా వైర‌స్ నిర్ధార‌ణ పరీక్షలు నిర్వ‌హించారు.

Read more RELATED
Recommended to you

Latest news