సీఎం కేసీఆర్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న ర‌ద్దు.. హైద‌రాబాద్ లోనే కేసీఆర్

-

తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి నేడు ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లాల‌ని నిర్ణ‌యం తీసుకున్న విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్ పంటి నొప్పితో బాధ‌ప‌డుతున్నాడు. దీంతో ఆ పంటి నొప్పి చికిత్స కోసం ఢిల్లీకి వెళ్లాల‌ని సీఎం కేసీఆర్ నిర్ణ‌యం తీసుకున్నారు. అయితే తాజా సమాచారం ప్ర‌కారం.. సీఎం కేసీఆర్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న ర‌ద్దు అయింది. ముఖ్య మంత్రి కేసీఆర్ ప్ర‌స్తుతం.. హైద‌రాబాద్ లోనే ఉన్నారు. ఢిల్లీ ప‌ర్య‌ట‌న ర‌ద్దు కావ‌డంతో ముఖ్య‌మంత్రి కేసీఆర్ రాష్ట్రంలోనే ఉన్నారు.

కాగ సీఎం కేసీఆర్ గ‌త కొద్ది రోజుల నుంచి ఢిల్లీ లోనే చికిత్స తీసుకుంటున్నారు. ఆయ‌న తో పాటు ఆయ‌న స‌తీమ‌ణి శోభ కూడా ఢిల్లీలోనే చికిత్స తీసుకుంటున్నారు. ఇటీవ‌లే… దాదాపు ఐదు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండి సీఎం కేసీఆర్ తో పాటు ఆయ‌న స‌తీమ‌ణి శోభ కూడా ఢిల్లీలోనే చికిత్స అందుకున్నారు. ఇప్పుడు కూడా సీఎం కేసీఆర్ కు పంటి నొప్పి రావ‌డంతో మ‌రో సారి ఢిల్లీకి వెళ్లాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. అయితే ఢిల్లీ ప‌ర్య‌ట‌న ర‌ద్దు అయింది. కాగ రేపు సీఎం కేసీఆర్ క‌రీంన‌గ‌ర్ జిల్లా ప‌ర్య‌ట‌నకు వెళ్లే అవ‌కాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news