బీజేపీ అధికారంలోకి వస్తే ప్రగతి భవన్ ను ప్రజా భవన్ గా మారుస్తాం: కిషన్ రెడ్డి

-

సీఎం కేసీఆర్ కొడుకు కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయడానికి తహతహలాడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. టిఆర్ఎస్ లో ఉన్నది తెలంగాణ ద్రోహులు అని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన మజ్లిస్ దోస్తీ చేస్తున్న కేసీఆర్… మోడీ సర్కార్ పై విషప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో నియంతృత్వ పాలన కొనసాగుతోందన్న కిషన్ రెడ్డి.. బీజేపీ అధికారంలోకి వస్తే ప్రగతి భవన్ ను తెలంగాణ ప్రజా భవన్ గా మారుస్తామని హామీ ఇచ్చారు.

తెలంగాణ కోసం జరిగిన ఆత్మబలిదానాలు అన్ని కేసీఆర్ కుటుంబం కోసం చేసినట్లుగా మారిందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రజలు ఎంతో చైతన్యవంతమైన ఆయన.. రాష్ట్రంలో ఇకపై తండ్రీకొడుకుల ఆటలు సాగవని హెచ్చరించారు. కమలం పార్టీ పాలమూరుకు ఎంతో రుణపడి ఉందన్న కిషన్ రెడ్డి.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news