బ్రేకింగ్ : నేడే ఏపీ తొలి క్యాబినెట్ సమావేశం..

-

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవలే తన మంత్రి వర్గాన్ని విస్తరించారు. అయితే.. మంత్రి వర్గంలో పునః వ్యవస్థీకరణలో కొంతమంది కొత్తవారికి చోటు దక్కింది. అయితే.. మంత్రివర్గ పునఃవ్యవస్థీకరణ తర్వాత రాష్ట్ర కేబినెట్‌ ఇవాళ తొలిసారి సమావేశం కానుంది. ముఖ్యమంత్రి జగన్‌ అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం జరగనున్నట్లు ఏపీ సీఎంవో వెల్లడించింది. దేవాదాయశాఖలో 2 లక్షల ఎకరాల ఆక్రమణలకు సంబంధించిన అంశంపై కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లు సమాచారం.

Andhra Pradesh: YS Jagan to tour Tirupati tomorrow, here is the schedule

దిశా చట్టంపై సవరణలకు సంబంధించిన అంశాలను సమీక్షించి కేంద్రానికి పంపుతారని సమాచారం. అమ్మ ఒడి పథకం గడపగడపకూ మన ప్రభుత్వం పేరిట నిర్వహిస్తున్న కార్యక్రమాలకు సంబంధించి సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. అయితే.. మంత్రి వర్గ పునః వ్యవస్థీకరణ అనంతరం తొలి సమావేశం కావడంతో.. ఎవరెవరు.. ఏయే నిర్ణయాలు తెరపైకి తీసుకువస్తారని ఆసక్తి నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news