యశ్వంత్ సిన్హా కు ఘనంగా స్వాగతం పలుకుదాం.. నగర ఎమ్మెల్యేలతో మంత్రి కేటీఆర్

-

జూలై 2న విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ కు రానున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఘనంగా స్వాగతం పలికేందుకు హైదరాబాద్ నగర ఎమ్మెల్యేలతో మంత్రి కేటీఆర్ గురువారం ప్రగతి భవన్ లో భేటీ అయ్యారు. బేగంపేట నుంచి జలవిహార్ వరకు భారీ ర్యాలీ కి టిఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. జలవిహార్ లో ముఖ్యమంత్రి కేసీఆర్, టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి యశ్వంత్ సిన్హా భోజనం చేయనున్నారు.

జూలై 2 న ఉదయం 10 గంటలకు యశ్వంత్ సిన్హా ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా జలవిహార్ కు సిన్హా చేరుకుంటారు. ఉదయం 11 గంటలకు యశ్వంత్ సిన్హా కు మద్దతుగా టిఆర్ఎస్ పార్టీ సభ నిర్వహించనుంది. ఈ సమావేశానికి టిఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news