ప్రధాని మోదీ, అమిత్ షాకు తెలంగాణ న్యాయవాదుల లేఖ

-

కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ హై కోర్టు న్యాయవాదులు లేఖ రాశారు. బిజేపి నేత నూపూర్ శర్మ పై సుప్రీం కోర్టు న్యాయ మూర్తులు చేసిన వాక్యాలు దుమారం…రేపిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ హై కోర్టు న్యాయవాదులు లేఖ రాశారు.

నూపూర్ శర్మ కేసులో న్యాయమూర్తులు రాజ్యాంగం విరుద్ధం వ్యవహిరించారని న్యాయ వాదులు ఆందోళనకు దిగారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తులు సూర్యాకాంత్, పార్ది వాలా పై అభిశంస తీర్మానం పెట్టాలని డిమాండ్ చేశారు తెలంగాణ హై కోర్టు న్యాయవాదులు. న్యాయ మూర్తులను సస్పెండ్ చేయాలనీ కూడా డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాని మోదీ, రాష్టపతి, కేంద్ర న్యాయశాఖ మంత్రి. కేంద్ర హోం మంత్రి కి లేఖ రాసారు తెలంగాణ న్యాయవాదులు.

Read more RELATED
Recommended to you

Latest news