అమెజాన్ ప్రైమ్ డే సేల్..వాటిపై భారీ డిస్కౌంట్..!!

-

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ప్రైమ్ కస్టమర్లకు వరుస గుడ్ న్యూస్ లను అందిస్తుంది.తాజాగా మరో గుడ్ న్యూస్ ను అందించింది.ఈ నెల 23-24 తేదీల్లో ప్రైమ్‌ కస్టమర్ల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ఈ సేల్‌కు సంబంధించి కొన్ని ఆఫర్లను కంపెనీ రివీల్‌ చేయడం మొదలు పెట్టింది..

ముఖ్యంగా అమెజాన్‌ ఉత్పత్తులైన ఎకో డాట్‌, ఫైర్‌ స్టిక్‌, కిండ్లేపై కంపెనీ భారీ డిస్కౌంట్లను ప్రకటించింది.అమెజాన్‌ ఎకోడాట్‌+ విప్రో స్మార్ట్‌ బల్బ్‌ కాంబో ప్యాక్‌ ఎమ్మార్పీ రూ.6,598 ఉండగా, ఇప్పుడు రూ.4,199కు అమెజాన్‌ విక్రయిస్తోంది. ప్రైమ్‌ డే సేల్‌లో ఈ రెండింటినీ 2,299కే విక్రయించనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఇక ఫైర్‌ టీవీ స్టిక్‌ మార్కెట్ ప్రైస్.. రూ.4,999.00 ఉండగా.. అది ఇప్పుడు రూ.3,999కు అమెజాన్‌ విక్రయిస్తోంది. ఆఫర్‌ సమయంలో దీన్ని 2,199కే విక్రయించనున్నట్లు కంపెనీ తెలిపింది. కిండ్లే ఈ-బుక్‌ రీడర్‌ను రూ.6,499కే విక్రయిస్తామని పేర్కొంది. ఫైర్‌ టీవీ స్టిక్‌ లైట్‌ (రూ.1799)తో పాటు ఇతర అమెజాన్‌ ఉత్పత్తులను సైతం తక్కువ ధరకే విక్రయిస్తామని కంపెనీ పేర్కొంది..

సేల్‌కు ఇంకా 10 రోజులకు పైగా గడువు ఉండడంతో మరికొద్ది రోజుల్లో మిగిలిన ఆఫర్లను కూడా అమెజాన్‌ ప్రకటించనుంది. ఐఫోన్‌ 13పై భారీ డిస్కౌంట్‌ ఉండబోతోందని కంపెనీ పేర్కొంది. ధరెంతనేది మాత్రం రివీల్‌ చేయలేదు. షావోమి, వన్‌ప్లస్‌, శాంసంగ్‌ మొబైల్స్‌పైనా డిస్కౌంట్లు లభించబోతున్నాయని పేర్కొంది. వాటి ధరలను త్వరలోనే రివీల్‌ చేసే అవకాశం ఉంది. ల్యాప్‌టాప్‌లు, టీవీలు, రిఫ్రిజిరేటర్లపైనా డిస్కౌంట్లు ఉండబోతున్నాయి..ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌ కార్డులతో కొనుగోళ్లపై 10% డిస్కౌంట్ వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news