రఘువరన్ తనయుడు గురించి ఈ విషయాలు తెలిస్తే షాక్..!!

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ విలన్ గా గుర్తింపు తెచ్చుకున్న రఘువరన్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈయన కేరళకు చెందిన వ్యక్తి అయినప్పటికీ తమిళ్, తెలుగు సినిమాలతో స్టార్ విలన్ గా ఎదిగారు. ఇక విలన్ గా ఈయన మొత్తం తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం కలుపుకొని 150 చిత్రాలకు పైగా నటించి.. సహాయ నటుడిగా కూడా కొన్ని చిత్రాలలో నటించాడు. ముఖ్యంగా సుస్వాగతం, బాబి, నాగ వంటి చిత్రాలతో మరింతమంది అభిమానులకు దగ్గరయ్యారు రఘువరన్. ఇక ఈయన ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్టు ఒకప్పటి హీరోయిన్ అయిన రోహిణి నీ 1996లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

ఇక వీరికి సాయి రిషి వరుణ్ అనే అబ్బాయి కూడా జన్మించాడు. కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల వీళ్ళిద్దరూ 2004లో విడాకులు తీసుకున్నారు. ఇక తర్వాత పూర్తిగా డ్రగ్స్ కి బానిసైనా రఘువరన్ ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇకపోతే ఆయన కొడుకును మాత్రం తల్లి రోహిణి దగ్గరుండి ఆ అబ్బాయి ఆలనా పాలన చూసుకుంది. ఇక ఈ క్రమంలోనే రోహిణి రఘువరన్ ల తనయుడు సాయి రిషి వరుణ్ ఇండస్ట్రీలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక ఇప్పటికే నటన విభాగంలో శిక్షణ కూడా పూర్తి చేసినట్లు సమాచారం.

ఇకపోతే తన తండ్రి విలన్ గా రాణించాడు కాబట్టి అతడు కూడా విలన్ గానే ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి కానీ సాయి రిషి వరుణ్ చూస్తే మాత్రం చాలా క్లాస్ గా హీరోకి బాగా సెట్ అవుతాడని రఘువరన్ అభిమానులు అంటూ ఉంటే ఇతడు మాత్రం విలన్ గా తన కెరీర్ను మొదలు పెట్టాలని చూస్తున్నాడు. ఇకపోతే ఇటీవల తన తండ్రి మ్యూజికల్ జర్నీకి సంబంధించిన ఆడియో లాంచ్ ను కూడా రజినీకాంత్ చేతుల మీదుగా లాంచ్ చేయడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news