రెచ్చిపోయిన గొలుసు దొంగలు.. కానిస్టేబుల్‌కు కత్తిపోట్లు!

-

హైదరాబాద్‌లోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గొలుసు దొంగలు రెచ్చిపోయారు. గంట వ్యవధిలో రెండు చోట్ల దొంగతనానికి పాల్పడ్డారు. ఈ క్రమంలో ఓ హెడ్ కానిస్టేబుల్‌పై కత్తితో పోట్లు పొడిచారు. మియాపూర్ మాతృశ్రీనగర్‌లో మంగళవారం ఓ సూపర్ మార్కెట్ వద్ద ఓ వృద్ధురాలి మెడలోని 10 గ్రాముల బంగారు గొలుసును లాక్కొని పరారయ్యారు. అలాగే మదీనగూడ ఉషోదయ ఎన్‌క్లేవ్ వద్ద ఓ మహిళ మెడలోని గొలుసు లాగేందుకు ప్రయత్నించారు. దీంతో ఆమె ఎదురు తిరగడంతో వారు పరారయ్యారు.

గొలుసు దొంగలు-పోలీసుల దాడి
గొలుసు దొంగలు-పోలీసులదాడి

ఈ మేరకు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. లింగంపల్లి కూడలిలో వాహన తనిఖీలు చేస్తున్నప్పుడు ముగ్గురు దొంగలు పారిపోతున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో వారిని రామచంద్రాపురంలోని అశోక్‌నగర్ హెచ్ఐజీ గేటు దగ్గర పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో కానిస్టేబుల్ రవిపై కత్తితో పొడిచారు. కడుపు, ఛాతి భాగంలో కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. ఈ మేరకు ముగ్గురు దొంగలను అరెస్ట్ చేసి.. కానిస్టేబుల్ యాదయ్యను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news