దేశానికి స్వాతంత్య్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీనే – రేవంత్ రెడ్డి

-

బ్రిటిష్ వారి నుంచి దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఉద్యమం నడిచింది. పెద్దఎత్తున ఉద్యమంలో పాల్గొన్నారు. లక్షలాది మంది వ జైళ్ల పాలు అయ్యారు. వేలాది మంది ప్రాణత్యాగాలు చేశారని గుర్తు చేశారు రేవంత్ రెడ్డి. బ్రిటిష్ వారిని తరిమి కొట్టి ప్రజలకు స్వేచ్ఛ వాయువులు అందించి స్వతంత్రాన్ని తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదని.. మహాత్మాగాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, అంబేత్కర్, నెహ్రు లాంటి వాళ్ళు ఎంతో మంది ఉద్యమాల ఫలితం నేటి స్వాతంత్రమని చెప్పారు.

పోరాట ఫలితంగా వచ్చిన స్వాతంత్రం తో ఒకవైపు ఆనందం. మరోవైపు దేశ విభజన విషాదమని.. మత కల్లోలాలు, దేశ విభజన నేపథ్యంలో దేశంలో తొలి ప్రధానిగా నెహ్రు దేశాన్ని ముందుకు తీసుకుపోవడంలో తన దూర దృష్టి, విజ్ఞానం తో ఎంతో కృషి చేసారని వెల్లడించారు. అంబేత్కర్ రచించిన రాజ్యాంగంతో 140 కోట్ల ప్రజలు 75 ఏళ్ల నుంచి హక్కులు, బాధ్యతలతో దేశంలో స్వేచ్ఛగా జీవిస్తున్నారని.. భిన్నత్వంలో ఏకత్వం, మత సామరస్యం, అభివృద్ధి, నైపుణ్యంతో దేశాన్ని శక్తి వంచన లేకుండా నెహ్రు దేశాన్ని ముందుకు నడిపారన్నారు.

దేశం కోసం మహాత్మాగాంధీ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ లు ప్రాణ త్యాగాలు చేశారని.. దేశాన్ని కడు పేదరికం నుంచి నేడు ప్రపంచంలో ఒక శక్తి వంతమైన దేశంగా నిర్మించడంలో కాంగ్రెస్ ప్రధాన మంత్రులు చేసిన కృషి మరువలేనిదని వివరించారు. దేశంలో ప్రజలకు సంక్షేమాన్ని అభివృద్ధిని అందించి ప్రజలను ఆత్మ గౌరవంతో బతికేల తీర్చిదిద్దిన ఘనత వారిదని.. అలాగే 60 ఏళ్లుగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం చేసిన పోరాటాన్ని గుర్తించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన ఘనత సోనియా గాంధీ గారిదన్నారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వం లో పటిష్టమైన పోరాటంతో పనిచేయాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news