భార‌త్‌, ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్‌లో ప్ర‌త్య‌క్ష‌మైన‌ విజ‌య్ మాల్యా..!

-

భార‌త్‌లో ఉన్న ప‌లు బ్యాంకుల‌కు వేల కోట్ల రూపాయ‌లు ఎగ‌నామం పెట్టి లండ‌న్ లో తిరుగుతున్న విజ‌య్ మాల్యా గురించి ఎప్పుడూ ఏదో ఒక విష‌యం వార్త‌ల్లో నిలుస్తూనే ఉంటుంది. మ‌రి ఈ సారి విజ‌య్ మాల్యాకు సంబంధించిన ఏ విష‌యం వైర‌ల్ అవుతుందో తెలుసా..? అత‌ను భార‌త్‌, ఇంగ్లండ్ ల మ‌ధ్య జ‌రుగుతున్న చివ‌రి టెస్ట్ మ్యాచ్‌కు హాజ‌ర‌య్యాడు. ఈ క్ర‌మంలోనే ఈ విష‌యం ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

భార‌త్‌, ఇంగ్లండ్ ల మ‌ధ్య లండ‌న్‌లోని ది ఓవ‌ల్ మైదానంలో నిన్న చివ‌రి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం అయిన విష‌యం విదిత‌మే. కాగా ఈ మ్యాచ్ ను చూసేందుకే విజ‌య్ మాల్యా స్టేడియానికి వ‌చ్చాడు. అయితే ఇటీవ‌ల అత‌ను భార‌త క్రికెటర్ల‌ను క‌లిసేందుకు అనుమ‌తించాల‌ని భార‌త ప్ర‌భుత్వాన్ని కోర‌గా, అత‌న్ని విజ్ఞ‌ప్తిని ప్ర‌భుత్వం తిర‌స్క‌రించింది. దీంతో క‌నీసం మ్యాచ్ అయినా చూద్దామ‌ని అత‌ను నిన్న స్టేడియానికి వ‌చ్చాడు. ఈ క్ర‌మంలోనే అత‌ను స్టేడియం వ‌ద్ద‌కు వ‌చ్చిన దృశ్యాలు ఇప్పుడు నెట్‌లో వైర‌ల్ అవుతున్నాయి.

కాగా ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న టెస్ట్ సిరీస్‌లో ఇప్ప‌టికే భార‌త్ సిరీస్‌ను 1-3 తో చేజార్చుకోగా క‌నీసం చివ‌రి టెస్టులో అయినా గెలిచి ప‌రువు నిల‌బెట్టుకోవాల‌ని చూస్తోంది. చివ‌రి టెస్ట్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకోగా, తొలి రోజు ఆట ముగిసే స‌మ‌యానికి ఇంగ్లండ్ 90 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 198 ప‌రుగులు చేసింది. మ‌రి ఈ టెస్ట్ మ్యాచ్‌లో అయినా భార‌త్ గెలుస్తుందా, లేదా అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news