లక్కు అంటే ఇదే..లక్షాధికారిని చేసిన చిత్తు పేపర్లు..

-

అదృష్టం ఎప్పుడు ఎవరిని వరిస్తుందో ఎవరికీ తెలియదు..అప్పుడు కరెక్ట్ గా స్పందిస్తే ధనవంతులు అవుతారు.ఇక దురదృష్టం మాత్రం తలుపు తెరిసె వరకూ తడుతూ ఉంటుంది. అదృష్టం ఒకసారి మాత్రమే తలుపు తడుతుంది. అలా తట్టినప్పుడే తలుపు తీసి ఇంట్లోకి ఆహ్వానించాలి.వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేవారు కూడా చాలా తక్కువే..ఒక్కసారిగా లక్షలను అందించింది. వాళ్ళు మాత్రమే ఇప్పుడు అనుకున్నవి సాధించడంతో పాటు అపరసంపన్నులుగా ఉంటారు..

ఇలాంటి అదృష్టమే బ్రిటన్‌ లో ఒక వృద్ధ దంపతులను వరించింది. వారిని లక్షాధికారిని చేసింది. మరోలా చెప్పాలంటే.. అదృష్టం తలుపు తట్టగానే వారు ఓపెన్ చేశారు.. వారి పంట పండింది.. లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చింది. ఒక్క రాత్రిలో లక్షాధికారి అయ్యారు.అసలు విషయానికొస్తే.. పాత కాలం లో సంపదలను భూమిలో పాతిపెట్టేవారు. కొందరు అడవులు, పర్వతాలలోనూ పాతిపెట్టారు. ఇలాంటి కథలు నిత్యం వింటూనే ఉంటాం.

తాజాగా బ్రిటన్‌లోని బ్రిస్టల్‌లో ఓ ఆశ్చర్యకర మైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంటి మరమ్మతుల సమయంలో ఓ వృద్ధ దంపతుల పంట పండింది. 100 సంవత్సరాలకు పైగా పురాతనమైన పాత నోట్లు వారికి లభించాయి. 1916, 1918 మధ్య ముద్రించిన 9 పాత నోట్లు కనిపించాయి. అవి పాతవి కావటంతో వాటికి మార్కెట్‌లో చాలా డిమాండ్ ఉంది.ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్న విషయం తెలిసిందే..వాటికి మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది..

అదే వారి కలలను నేరవెర్చింది.. ఒక్కసారిగా లక్షలను అందించింది. దాంతోపాటు ధర కూడా గట్టిగానే పలికింది. వీటిని వేలం వేయగా.. ఏకంగా రూ. 47 లక్షలు వచ్చాయి. ప్రస్తుతం వేలంలో వచ్చిన డబ్బుతో ఈ వృద్ధ దంపతులు తమ డైమండ్ జూబ్లీ వార్షికోత్సవాన్ని జరుపుకోవాలని ప్లాన్స్ వేస్తున్నారు..ఇలాంటి అదృష్టం మనకొస్తే బాగుండు అని అనుకుంటూన్నారు కదా..ఎదానికైనా రాసి పెట్టి ఉండాలి..లక్కు అంటే ఇదే మరి..

Read more RELATED
Recommended to you

Latest news