ఉపాధి హామీ కూలీలకు సీఎం జగన్ గుడ్ న్యూస్..

-

ఏపీలోని ఉపాధి కూలీలకు సీఎం జగన్‌ తీపికబురు చెప్పారు. ఉపాధి హామీ పథకం కింద కనీసం వేతనం రూ.240 లు అందేలా చూడాలని సీఎం ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో గడప గడపకూ మన ప్రభుత్వం నిర్వహించిన నెల రోజుల్లో ప్రాధాన్యతా పనులు మొదలు కావాలని ఆదేశించిన సీఎం జగన్.. అక్టోబరు 25న ఇ–క్రాపింగ్‌ జాబితాలు సచివాలయాల్లో ప్రదర్శన, షెడ్యూల్‌ వివరించారు.

డిసెంబర్‌ 25 నాటికి 5 లక్షల ఇళ్లు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం జగన్‌.. జగనన్న కాలనీల్లో 3.5 లక్షలు, 1.5 లక్షల టిడ్కో ఇళ్లు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కొత్తగా అర్హులైన లబ్ధిదారులకు ఫేజ్‌ –3 కింద డిసెంబర్లో ఇళ్ల మంజూరు చేయాలని పేర్కొన్నారు. ఎస్‌డీజీ లక్ష్యాల సాధన ఆధారంగా కలెక్టర్లకు మార్కులు ఉండాలని.. ఎస్‌డీజీ లక్ష్యాలే కలెక్టర్ల పని తీరుకు ప్రమాణంసీఎం వెల్లడించారు సీఎం జగన్‌.

Read more RELATED
Recommended to you

Latest news