పసికందును నేలకేసి కొట్టి చంపిన అమ్మమ్మ

-

సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో ఘోరం చోటుచేసుకుంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన అమ్మమ్మ ఓ పసికందును అతి కిరాతకంగా హతమార్చింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అసలేం జరిగిందంటే..?

సంగారెడ్డి జిల్లా సదాశివపేట పోలీసు స్టేషన్‌ వెనుక విభాగంలో నివాసం ఉండే సత్తగారి సూర్యకళ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తోంది. ఆమెకు భర్త లేడు. కూతురు మౌనిక రెండేళ్ల క్రితం నర్సింలు అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆమె ఎనిమిది నెలల గర్భిణిగా ఉన్నప్పుడు భర్త మృతి చెందాడు.

భర్త మరణం తర్వాత మౌనిక తల్లితోపాటే ఉంటోంది. ఆమెకు 28 రోజుల క్రితం మగ శిశువు పుట్టాడు. శనివారం రాత్రి తల్లీకూతుర్ల మధ్య వివాదం చోటు చేసుకుంది. ఆదివారం ఉదయం కూడా గొడవ జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన సూర్యకళ కూతురు ఒడిలో ఉన్న పసికందును లాక్కొని నేలకేసి కొట్టింది. దీంతో ఆ బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కుమార్తె ఫిర్యాదుతో తల్లిపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ రవీంద్రారెడ్డి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news