శ్రీరాముడిపై ప్రభాస్ సంచలన వ్యాఖ్యలు

-

ప్రభాస్ హీరోగా నటించిన ఆదిపురుష్ సినిమా టీజర్ నిన్న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. నిన్న అయోధ్యలో ఈ ఈ వెంట్ జరిగింది. ఈ సందర్భంగా శ్రీరాముడిపై హీరో ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

శ్రీరాముడి ఆశీస్సులు తీసుకునేందుకు అయోధ్య నగరానికి వచ్చామని… మొదట ఆ పాత్రలో నటించేందుకు తాను భయపడ్డానని పేర్కొన్నారు. ప్రాజెక్టు అనుకున్న మూడు రోజుల తర్వాత దర్శకుడు ఓం రౌత్ కు ఫోన్ చేశానని ఆ పాత్రలో మెప్పించేలా ఎలా నటించాలని మాట్లాడుతున్నామని వెల్లడించారు.

ప్రేమ మరియు భయ భక్తులతో ఈ సినిమాలు రూపొందించామని అంకితభావం, క్రమశిక్షన తో సినిమాను తీశామని స్పష్టం చేశారు హీరో ప్రభాస్. శ్రీరాముడి కృప మాపై ఉంటుందని మేము నమ్ముతున్నామని ఈ ప్రభాస్ ఎమోషనల్ వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news