పాపం శ్రీను వైట్ల ఈసినిమా అయినా స్టార్ట్ అయ్యేనా..!!

-

డైరెక్టర్ శ్రీను వైట్ల గతంలో  టాలీవుడ్ లో ఏన్నో హిట్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాను తన దైనశైలిలో కామెడీ కి కమర్షియల్ అంశాలు కలిపి హిట్ ఫార్ములా తయారు చేశాడు. కాని రాను రాను అది జనాలకు మొహంమొత్తి  తన సినిమాలను చూడ్డం మానేశారు. ప్రస్తుతం ఏ నిర్మాత కూడా తన ఇంటికెల్లే సాహసం చేయడం లేదు. గతంలో మహేష్ బాబు దూకుడు తర్వాత, తన రేంజ్ రాజమౌళిని దాటి పోయేలా వుంది అన్నవారు, తర్వాత వచ్చిన మిస్టర్, రవితేజ  సినిమాలతో విపరీతంగా ట్రోల్ చేయడం చేసారు.

దీంతో ఒకప్పటి ఈ స్టార్ డైరెక్టర్ సినిమాలకు దూరంగా వున్నారు. మధ్యలో భార్యతో విభేదాలు వచ్చి విడాకుల వరకు వెళ్ళింది. తర్వాత మంచు విష్ణు, తన కాంబినేషన్లో వచ్చిన సూపర్ హిట్ సినిమా ఢీ కి సీక్వెల్ తీస్తున్నామని చెప్పాడు. దీనికి ఢీ అంటే ఢీ అనే టైటిల్ కూడా అనుకున్నారు. కాని  ప్రస్తుతం ఆ సినిమా ఎక్కడా వినిపించడం లేదు. విష్ణు మాత్రం జిన్నా సినిమాలో నటిస్తున్నాడు. మరో వైపు రవితేజ తో సినిమా అనుకున్నారు, అదీ కూడా నిజం అయ్యేలా లేదు.

తాజాగా పక్కా కమర్షియల్ సినిమా తో  హిట్ అందుకోని  గోపీచంద్ తో శ్రీను వైట్ల సినిమా ఒకే చేయించుకున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.గోపీచంద్ కు తన దైన శైలిలో అన్ని అంశాలు వున్న కథ చెప్పాడని, దానికి గోపి అంగీకరించాడని టాలివుడ్ వర్గాలు అంటున్నాయి. అయితే దీని కథ తన పాత మిత్రుడైన గోపి మోహన్ ఇస్తున్నాడని సమాచారం. శ్రీనువైట్ల కు ఈ సినిమా చావో రేవో తేల్చుకోవాల్సిన సినిమా గా మారింది. మరో వైపు గోపీచంద్ కూడా హిట్ కోసం ఆత్రుతగా వున్నాడు. ఈ సినిమా అయినా స్టార్ట్ అయి శ్రీనువైట్ల ను మళ్లీ లైమ్ లైట్ లోకి తెస్తుందేమో వేచిచూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news