సినీ న‌టుడు పృథ్వీ ఎస్‌వీబీసీ చైర్మ‌న్‌, డైరెక్ట‌ర్‌గా నియామ‌కం..

-

సినీ న‌టుడు పృథ్వీకి సీఎం జ‌గ‌న్ బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చారు. పృథ్వీని శ్రీ‌వెంక‌టేశ్వ‌ర భ‌క్తి చాన‌ల్ డైరెక్ట‌ర్‌, చైర్మ‌న్‌గా నియ‌మిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు.

అంతా అనుకున్న‌ట్లే జ‌రిగింది.. సినీ న‌టుడు పృథ్వీకి సీఎం జ‌గ‌న్ బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చారు. పృథ్వీని శ్రీ‌వెంక‌టేశ్వ‌ర భ‌క్తి చాన‌ల్ డైరెక్ట‌ర్‌, చైర్మ‌న్‌గా నియ‌మిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ మేర‌కు ఏపీ ప్ర‌భుత్వం ఇవాళ ఉత్త‌ర్వుల‌ను జారీ చేసింది. పృథ్వీ ఎంతో కాలంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడిగా ప‌నిచేస్తున్నారు. గ‌తంలో జ‌గ‌న్ పాద‌యాత్ర‌లోనూ ఆయ‌న పాల్గొన్నారు. అలాగే ఇటీవ‌ల జ‌రిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ పృథ్వీ వైకాపా ప్రచార కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు. అందుక‌నే జ‌గ‌న్ ఆయ‌న‌కు ఆ ప‌ద‌వి ఇచ్చారు.

ఎస్‌వీబీసీ చైర్మ‌న్‌గా గ‌త కొద్ది రోజుల కింద‌ట ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కె.రాఘ‌వేంద్ర రావు రాజీనామా చేసిన విష‌యం విదిత‌మే. ఆరోగ్య కార‌ణాలు, వ‌య‌స్సు దృష్ట్యా తాను ఆ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు ఆయ‌న ప్ర‌క‌టించి ఆ ప‌ద‌వికి రాజీనామా చేశారు. దీంతో ఆ ప‌ద‌వి కొంత కాలంగా ఖాళీగా ఉంది. అయితే ఆ ప‌ద‌వికి సినీ న‌టుడు పృథ్వీని ఎంపిక చేస్తార‌ని గ‌త కొంత కాలంగా జోరుగా ప్ర‌చారం సాగింది. ఈ క్ర‌మంలోనే అదే వార్త‌ను సీఎం జ‌గ‌న్ ఇవాళ నిజం చేశారు.

కాగా ఎస్‌వీబీసీ చైర్మ‌న్‌గా పృథ్వీ జూలై 28వ తేదీన బాధ్య‌త‌లు తీసుకోనున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఆ ప‌ద‌విని ఎలా నిర్వ‌హిస్తార‌నే విష‌యం ఆస‌క్తిగా మారింది. అప్ప‌ట్లో ఎస్‌వీబీసీ చాన‌ల్ ఎన్నో వివాదాల‌కు మూల కేంద్రంగా మారింది. మ‌రి పృథ్వీ రాక‌తో ఎస్‌వీబీసీ చాన‌ల్ ఆయ‌న సార‌థ్యంలో ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి..!

Read more RELATED
Recommended to you

Latest news