జనసేన ను “బాబుసేన”గా మార్చండి – మంత్రి గుడివాడ అమర్నాథ్

-

చంద్రబాబు బాణీ వినిపించడానికే పవన్ కళ్యాణ్ జనవాణి ప్రోగ్రామ్ పెట్టారని అన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్. జనసేన పేరుని బాబుసేన గా మార్చుకోవాలని సూచించారు. రాష్ట్రంపై అవగాహన లేకుండా పేపర్, ఫోన్ చూసి మాట్లాడుతున్నారని ఆరోపించారు. జనవాని ప్రోగ్రాం మూడు నెలల క్రితమే పెట్టామని పవన్ కళ్యాణ్ అబద్ధాలు ఆడుతున్నారని మండిపడ్డారు. తాము విశాఖ గర్జనను ప్రకటించిన మనసుటి రోజే వారు జనవానిని ప్రకటించారని తెలిపారు.

ఎయిర్ పోర్టులో మంత్రులపై జరిగిన దాడిని విశాఖ గర్జనపై జరిగిన దాడిగా పరిగణిస్తున్నామని అన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా విశాఖను పాలన రాజధానిగా చేయాలన్న నినాదంతో శనివారం నిర్వహించిన విశాఖ గర్జన కార్యక్రమాన్ని అన్ని టీవీ ఛానల్లు, జాతీయ వార్తా సంస్థలు ప్రధానంగా చూపిస్తుండడం చూసి ఓర్వలేకనే ఈ ఉద్యమాన్ని పక్కదోవ పట్టించేందుకు పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారని మండిపడ్డారు. ఈ దాడికి బాధ్యత వహిస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news