మరోసారి సంచలన పోస్ట్ పెట్టిన డైరెక్టర్ విఘ్నేష్ శివన్..!!

-

హీరోయిన్ నయనతార – డైరెక్టర్ విఘ్నేష్ శివన్  దంపతులు ఇటీవల  తమకు కవల పిల్లలు పుట్టారని చెబుతూ, సోషల్ మీడియా వేదికగా తమ సంతోషాన్ని పంచుకున్న దగ్గర నుండి వివాదం మొదలైన సంగతి తెలిసిందే.నయన్‌ దంపతులు చట్టాలను ఉల్లంఘించి సరోగసి విధానాన్ని అనుసరించారని అప్పటి నుండి గోల మొదలయ్యింది. దీనిపై నెటిజన్స్ మరియు సెలబ్రిటీలు తలో రకంగా కామెంట్స్ చేసారు. దీనిపై తమిళనాడు ప్రభుత్వం వివరణ కోరగా, ఈ జంట రీసెంట్ గా తగిన ఆధారాలతో వివరణ ఇచ్చారు. అయినా కూడా ఇంకా దీనిపై చర్చలు సాగుతూనే ఉన్నాయి.

 ఇదిలా ఉంటే విఘ్నేశ్‌ తాజాగా ఇన్‌స్టా వేదికగా చేసిన పోస్ట్‌  ఎవరి గురించో జనాలకు అర్ధం కాకుండా వుంది.ప్రస్తుతం  ఇది సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈపోస్ట్లో ‘మనం చూసే విధానం బాగుంటే ప్రతి దానిలో మనకు మంచి  మాత్రమే కనిపిస్తుంది’ అంటూ గతంలో ఓ నిర్మాత షేర్ చేసిన కొటేషన్‌ను విఘ్నేశ్‌ పోస్ట్‌ చేశారు. ఇక మరో పోస్ట్ లో. ‘మన జీవితంలో అన్ని రోజులు ఒకలా ఉండవు, కాని జీవితంలో చికాకు కలిగించే  రోజులు కూడా కొన్నిసార్లు మనకు మంచిదే. ప్రతిదానిలో మంచిని చూసేందుకు ప్రయత్నిచండి. అందుకు ప్రతి విషయాన్ని అనుకూలం గా తీసుకోండి. మీ జీవితంలో ఆనందం అనేది మన ఆలోచనల మీద ఆధార పడి ఉంటుంది అని రాసుకొచ్చారు.

ఇది ఎవరిని టార్గెట్ చేసి రాశారు అనేది చాలా మందికి అర్ధం కావడం లేదు. కాని బిడ్డలు పుట్టిన ఆనందం కంటే వివాదం ఎక్కువ ప్రచారం జరగడం తో నయనతార – డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ఇద్దరూ బాధ పడుతున్నారని ఈ పోస్ట్స్ బట్టి తెలుస్తోంది. అలాగే ఈ గోల నుండి మమ్ముల్ని వదిలి పెట్టండి అనేలా పోస్ట్ వుంది.వివాదం ముగిసి పోయి దంపతులు ఆనందంగా ఉంటూ, పిల్లలకు మంచి భవిష్యత్ రావాలని కోరుకుందాం.

Read more RELATED
Recommended to you

Latest news