యువతకు మోదీ ‘దీపావళి’ గిఫ్ట్.. 75 వేల మందికి ఉద్యోగాలు..!

-

భారత యువతకు ప్రధాని మోదీ ఈ దీపావళికి ఓ అందమైన బహుమతి ఇవ్వనున్నారు. దీపావళి కానుకగా ఈనెల 22న 75వేల మంది యువతతో మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి వారికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేయనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. పలు మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ విభాగాలకు ఎంపికైన యువతకు ఈ అపాయింట్‌మెంట్‌ లెటర్లను అందించనున్నారట.

దేశంలో నిరుద్యోగంపై విపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు ఎదురవుతున్న నేపథ్యంలో ఈ ఏడాది జూన్‌లో ప్రధాని మోదీ కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. రానున్న 18 నెలల్లో 10లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగానే పలు ప్రభుత్వ విభాగాల్లో ఇటీవల ఉద్యోగాల భర్తీ చేపట్టారు.

రక్షణ, రైల్వే, హోం, కార్మిక-ఉపాధి శాఖలు, తపాలా శాఖ, సీఐఎస్‌ఎఫ్‌, సీబీఐ, కస్టమ్స్‌, బ్యాంకింగ్‌ తదితర రంగాల్లో ఉద్యోగాలకు ఎంపికైన యువతతో మోదీ ముచ్చటించనున్నారు. దేశవ్యాప్తంగా జరిగే ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు కూడా పాల్గొననున్నారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ ఒడిశా నుంచి, ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ గుజరాత్‌ నుంచి, సమాచార-ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ చండీగఢ్‌ నుంచి, వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌ మహారాష్ట్ర నుంచి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తమిళనాడు నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొననున్నట్లు సదరు వర్గాలు వెల్లడించాయి.

Read more RELATED
Recommended to you

Latest news