భారత్‌లో ఆర్థికమాంద్యం వచ్చే ఛాన్సే లేదు : నీతి ఆయోగ్‌ మాజీ వైస్‌ ఛైర్మన్‌

-

ప్రపంచమంతా ఆర్థిక మాంద్యంతో అట్టుడికిపోతోంది. దాని ప్రభావం భారత్ పైనా పడుతోంది. ఈ క్రమంలో నీతి ఆయోగ్ మాజీ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు భారతీయులకు కాస్త ఉపశమనాన్ని కలగజేస్తున్నాయి. భారత్‌లో ఆర్థికమాంద్యం వచ్చే అవకాశం లేదని రాజీవ్‌ తెలిపారు. 2023-24లో దేశం 6-7 శాతం ఆర్థిక వృద్ధిని నమోదు చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రపంచం మొత్తం మాంద్యంలోకి జారుకున్నా భారత్‌లో మాత్రం అలాంటి పరిస్థితులు ఉండవని తెలిపారు.

అమెరికా, ఐరోపా, జపాన్‌, చైనా ఆర్థిక వ్యవస్థలు ఒకదానికొకటి అనుసంధానమై ఉన్నాయని రాజీవ్‌ కుమార్‌ తెలిపారు. ఆయా దేశాల్లో ఆర్థిక మందగమనం వల్ల ప్రపంచం మొత్తం మాంద్యంలోకి జారుకుంటుందని అన్నారు. కానీ, భారత్‌లో మాత్రం అలాంటి అవకాశం లేదని స్పష్టం చేశారు. వృద్ధిరేటుపై మాత్రం కొంత ప్రతికూల ప్రభావం ఉండొచ్చన్నారు. అయినా 2023- 24లో 6-7 శాతం వృద్ధి నమోదవుతుందని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు దేశంలో ద్రవ్యోల్బణం మరికొంత కాలం 6-7 శాతం మధ్య ఉంటుందని చెప్పారు. తర్వాత క్రమంగా కిందకు దిగొస్తుందని వెల్లడించారు. ధరల పెరుగుదల ముఖ్యంగా చమురు ధరలపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news