అమిత్ షాతో భేటీ అయిన ఎంపీ సీఎం రమేష్

-

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో భేటీ అయ్యారు రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్. పార్లమెంటులోని అమిత్ షా కార్యాలయంలో సుమారు 45 నిమిషాల పాటు ఈ భేటీ జరిగింది. ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, సీఎం జగన్ పాలన గురించి అమిత్ షాకు సీఎం రమేష్ వివరించినట్లు సమాచారం. ఇదే సమయంలో ఏపీలోని బిజెపి పరిస్థితి ఎలా ఉందనే విషయంపై అమిత్ షా ఆరా తీసినట్టు తెలుస్తోంది.

ఇక ఏపీలోనూ బిజెపి బలపడేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ప్రధాని మోదీ అల్లూరి విగ్రహావిష్కరణకు ఏపీకి వచ్చిన సందర్భంలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పార్టీ కార్యక్రమాలను ఉదృతం చేయాలని పార్టీ శ్రేణులకు సూచించిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news