BREAKING : కాంగ్రెస్ కమిటీలకు 13 మంది సభ్యుల రాజీనామా

-

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గత విబేధాలు భగ్గుమన్నాయి. అసలైన కాంగ్రెస్‌, వలస కాంగ్రెస్‌ అంటూ రెండు వర్గాలుగా విడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల పీసీసీ జంబో కమిటీలు ప్రకటనతో అంతర్గతంగా ఉన్నఅసంతృప్తి బహిర్గతం అవుతోంది. గత కొన్ని రోజులుగా నాయకుల్లో ఉన్న అసంతృప్తి క్రమంగా పెరుగుతోంది.

తెలంగాణ కాంగ్రెస్‌ కమిటీలపై ముదిరిన సంక్షోభం తారస్థాయికి చేరింది. వలస వచ్చిన వారికి పదవులు కట్టబెట్టారని సీనియర్‌ నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో.. TDP నుంచి వచ్చిన 13 మందికి  నేతలు కాంగ్రెస్‌ కమిటీలకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తమ రాజీనామా పత్రాలను పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌కి ఇవ్వనున్నట్లు వెల్లడించారు. రాజీనామా చేసిన వారిలో నరేందర్‌రెడ్డి, సీతక్క, విజయరామారావు, చారగొండ వెంకటేశ్‌, ఎర్ర శేఖర్‌, పటేల్ రమేష్ రెడ్డి, సత్తు మల్లేశ్‌ తదితరులు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news