సీఎం కేసీఆర్ కి రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

-

తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు కి బహిరంగ లేఖ రాశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. పత్తికి గిట్టుబాటు ధర కల్పించాలని, రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రేవంత్ రెడ్డి లేఖ రాశారు. పంటలకు మద్దతు ధర దక్కకుండా దళారులు రైతులను మోసం చేస్తుంటే ప్రభుత్వం కనీసం స్పందించడం లేదని మండిపడ్డారు. వారి సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకుంటే రైతులు మరెవరితో చెప్పుకోవాలని ప్రశ్నించారు.

గిట్టుబాటు ధర రాక రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి దాపురించిందని ఆరోపించారు. పత్తికి క్వింటాలుకు 15వేల రూపాయల చొప్పున ఇవ్వాలని, వెంటనే లక్ష రూపాయల రుణమాఫీని అమలు చేసి ఆదుకోవాలని కోరారు. కౌలు రైతులను గుర్తించి, వారికి అందే అన్ని రకాల రకాలు అమలు చేయాలని లేఖలో కోరారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవడానికి, ప్రైవేటు అప్పుల విషయంలో వన్ టైం సెటిల్మెంట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news