తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై చంద్రబాబు ఆరా

-

కుప్పం పిసిఎస్ ఆసుపత్రిలో తారకరత్నకు చికిత్స కొనసాగుతోంది. తారకరత్న కి యాంజియోగ్రామ్ చేసిన వైద్యులు.. గుండెకు వెళ్లే రక్తనాళాలలో బ్లాక్ లో ఉన్నట్లు గుర్తించారు. ఉదయం ఆయన స్వస్థతకు గురికావడానికి కారణం గుండెపోటు అని వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ప్రాణపాయం తప్పినట్లు వైద్యులు తెలిపారు. తదుపరి వైద్య చికిత్స కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, టిడిపి సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆసుపత్రిలోనే ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. ఆసుపత్రి వైద్యులతో చంద్రబాబు ఫోన్లో మాట్లాడి.. తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఆసుపత్రి వద్ద ఉండి తారకరత్న ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్న బాలకృష్ణ, గోరంట్ల బుచ్చయ్య తో చంద్రబాబు మాట్లాడారు. అవసరమైతే బెంగళూరుకు తరలించాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news