షర్మిల పాదయాత్రకు అనుమతి.. కండిషన్స్ అప్లై

-

వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్రకు వరంగల్ సిపి రంగనాథ్ అనుమతి ఇచ్చారు. కానీ కొన్ని షరతులతో కూడిన పాదయాత్రకి అనుమతి ఇచ్చారు పోలీసులు. గత ఏడాది నవంబర్ 28న చెన్నారావుపేట వద్ద షర్మిల పాదయాత్ర నిలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 2 నుంచి 18 వరకు పాదయాత్ర నిర్వహించుకోవాలని షర్మిలకు సూచించారు సిపి రంగనాథ్.

ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7:00 వరకు మాత్రమే పాదయాత్ర నిర్వహించాలని సూచించారు. పాదయాత్ర సమయంలో పార్టీలు, కుల మతాలు, వ్యక్తిగతంగా ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయవద్దని షరతులు పెట్టారు. అంతే కాదు పాదయాత్రలో ఫైర్ క్రాకర్స్ ఉపయోగించవద్దని, ప్రభుత్వ, ప్రభుత్వెతర సంస్థల విధులకు ఆటంకం కలిగించవద్దనే నిబంధనలతో పాదయాత్రకి అనుమతి ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news