Joginder Sharma : T20 వరల్డ్ కప్ హీరో రిటైర్మెంట్ ప్రకటన…

-

టీమిండియా వెటరన్ క్రికెటర్ జోగిందర్ శర్మ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టి20 ప్రపంచ కప్-2007 హీరో, టీమిండియా వెటరన్ అండ్ క్రికెటర్ జోగిందర్ శర్మ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు.

అన్ని ఫార్మాట్ ల నుంచి తప్పుకుంటున్నట్లు శుక్రవారం ఓ ప్రకటన ద్వారా వెల్లడించాడు. ఈ విషయాన్ని జోగిందర్ తన ట్విట్టర్ లో ప్రత్యేక లేఖ ద్వారా పంచుకున్నాడు. టీమ్ ఇండియాకు ఆడడం తనకు దక్కిన గౌరవమని, ఇందుకు సహకరించిన బీసీసీకి కృతజ్ఞతలు అని చెప్పాడు.

ప్రస్తుతం కొత్త జీవితం ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించాడు. కాగా, జోగిందర్ రిటైర్మెంట్ తో 2007 టీ20 వరల్డ్ కప్ ఆడిన భారత జట్టులో దినేష్ కార్తీక్, రోహిత్ శర్మ మాత్రమే మిగిలారు. వీరిలో దినేష్ కార్తీక్ 2022 టీ20 వరల్డ్ కప్ ఆడగా, రోహిత్ శర్మ టీం ఇండియా కెప్టెన్ గా ఉన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news