భారత్‌లో 94.50 కోట్లకు చేరిన ఓటర్ల సంఖ్య

-

భారత్‌లో ప్రస్తుతం ఓటర్ల సంఖ్య 94.50 కోట్లకు చేరిందని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. సుమారు 140 కోట్లకు పైగా జనాభా ఉన్న దేశంలో ఈ ఏడాది జనవరి 1 నాటికి 94,50,25,694 మంది ఓటర్లుగా తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఈ మొత్తం ఓటర్లలో సుమారు 31.50 కోట్ల మంది ఓటర్లు గత 2019 లోక్​సభ ఎన్నికల ఓటింగ్​కు దూరంగా ఉన్నట్లు ఈసీ చెప్పింది.

వీరిలో ఎక్కువ శాతం మంది ఓటర్లు పట్టణ ప్రాంతాల్లోని ప్రజలు, యువతతో పాటు వలస వెళ్లిన వారే ఉన్నారని ఈసీ నివేదికలో పేర్కొంది. ఓటు వేయని వారిని పోలింగ్‌ కేంద్రాలకు తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు చెప్పింది. 1951లో మొదటిసారి జరిగిన సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుతం ఓటర్ల శాతం ఆరు రెట్లు ఎక్కువని ఈసీ తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news